అచ్చంగా తెలుగులో వింజమూరి వేంకట అప్పారావు గారి ప్రభాతరాగానికి కవితసేత..
చలనంలేక తొంగొనియుంటూ
కలుపుమొక్కలా తొలిచేస్తుంటే
పచ్చనిస్వప్నం చూసేదెట్టా?
కలుపుగోలు మరి కనబడదంటూ
అడ్డగోలుగా పెరిగేస్తుంటే
మనవను మాటలు తెలిసేదెట్టా?
కౌలుకుగృహమున కట్టడదంటూ
మూలనలాగ మూల్గేస్తుంటే
వాకిలిదారులు కనపడవట్టా!
వీచేగాలులు పీల్చుకుతింటూ
మానులలాగ బతికేస్తుంటే
రాలేఫలాలనన్నా నువ్విచ్చేదెట్టా!
స్వరాలకష్టం ఎవరిదోయంటూ
సవాళ్ళ వెనకదారేదంటే
ప్రగతికిబాటలు తెలిసేదెట్టా!
ప్రభాతభానుడు వచ్చాడంటూ
తిమిరంలాగ పరిగెడకుంటే
చుట్టూచీకటి మిత్రమన్నట్టా?
పుట్టుకచావులు కదలవవంటే
పారేనెత్తురు పరిగెడుతుంటే
ఆగినగాలీ ఎగిరొస్తుంటే
చరమాంకాలు వెదకకపొడిచే
రవికిరణాలే తలుపులుతడితే
రాతిరికేళి పరుగులబడితే
లేలేలెమ్మని పిలుపులుపెడితే
ఎందుకు నీకీ నిదురలజగతి
ఎందుకు నీకీ ఆవాహనస్థితి
పరుగులు నీవి
పదములు నీవి
పలుకులు నీవి
పని మరి నీది
పాతలవాటులు
పెరటికి నెట్టి
పాటుల బాటలు
పుక్కినబట్టి
పరుపులవన్నీ
పక్కనబెట్టి
ప్రగతికి నీవే
పథములు వెదికెయ్!
No comments:
Post a Comment